వ్యవసాయ రంగంలో విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పంట వేసినప్పటి నుంచే వారి వివరాలు, పంటల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశపై వ్యవసాయ శాఖకు పూర్తి సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. వర్షాకాలం, ఖరీఫ్ సీజన్కు సంబంధించిన చర్యలపై సమీక్ష సమావేశంలో రైతు కమిషన్, వ్యవసాయ నిపుణులు, విశ్వవిద్యాలయాల సూచనలను చర్చించారు. రైతులు ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా నిర్వహించేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీ పంటల నమోదు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై దృష్టి పెట్టనుంది. సన్న వడ్లు సాగు చేసే రైతులకు బోనస్ అందిస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. రైతు వేదికలను రైతులకు సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేసి అక్కడే విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అల...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి