విధ్వంసం కాదు.. నిర్మాణమే యువత లక్ష్యం కావాలి...
కాకినాడ: యువత మార్పు కోసం పోరాడాలని, అయితే ఆ పోరాటం విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు సాగాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. యువత భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదని, ప్రస్తుత బలమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యలను ప్రశ్నించాల్సిందేనని, అయితే ప్రశ్నించే ముందు నిజానిజాలను తెలుసుకోవాలని సూచించారు. డబ్బుకు ఓటును, తప్పుడు సమాచారానికి ఆలోచనను, ద్వేషానికి భవిష్యత్తును అప్పగించవద్దని యువతకు సూచించారు. సోషల్ మీడియా సమాచారంపై అప్రమత్తత... సోషల్ మీడియాలో వేగంగా ప్రచారంలోకి వచ్చే ప్రతి సమాచారం నిజం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ విషయాన్నైనా నమ్మే ముందు ఆలోచించాలని, అనుసరించే ముందు ప్రశ్నించాలని, నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. బలమైన ప్రజాస్వామ్యానికి గుడ్డిగా అనుసరించే యువత కాకుండా.. ఆలోచించే, ప్రశ్నించే, సమస్యలకు పరిష్కారాలు సూచించే బాధ్యతాయుతమైన యువత అవసరమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం... భగత్ సింగ్, అల్లూరి సీతారామరా...