పోస్ట్‌లు

ఆంధ్రప్రదేశ్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

విధ్వంసం కాదు.. నిర్మాణమే యువత లక్ష్యం కావాలి...

చిత్రం
కాకినాడ: యువత మార్పు కోసం పోరాడాలని, అయితే ఆ పోరాటం విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు సాగాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. యువత భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదని, ప్రస్తుత బలమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యలను ప్రశ్నించాల్సిందేనని, అయితే ప్రశ్నించే ముందు నిజానిజాలను తెలుసుకోవాలని సూచించారు. డబ్బుకు ఓటును, తప్పుడు సమాచారానికి ఆలోచనను, ద్వేషానికి భవిష్యత్తును అప్పగించవద్దని యువతకు సూచించారు. సోషల్ మీడియా సమాచారంపై అప్రమత్తత... సోషల్ మీడియాలో వేగంగా ప్రచారంలోకి వచ్చే ప్రతి సమాచారం నిజం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ విషయాన్నైనా నమ్మే ముందు ఆలోచించాలని, అనుసరించే ముందు ప్రశ్నించాలని, నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. బలమైన ప్రజాస్వామ్యానికి గుడ్డిగా అనుసరించే యువత కాకుండా.. ఆలోచించే, ప్రశ్నించే, సమస్యలకు పరిష్కారాలు సూచించే బాధ్యతాయుతమైన యువత అవసరమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం... భగత్ సింగ్, అల్లూరి సీతారామరా...

సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సందేశం.. అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడి

చిత్రం
భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తి గౌరవం.. కానీ దూషణలు, బెదిరింపులు, తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం. అమరావతి, జూలై 1 : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక సందేశాన్ని విడుదల చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ, అది అపరిమిత హక్కు కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు, నిర్ణయాలతో విభేదించే హక్కును తమ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. అయితే వ్యక్తిగత దూషణలు, ప్రాణహానితో బెదిరింపులు, ఆధారాలు లేని ఆరోపణలు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, మత విశ్వాసాలను అవమానించడం, ద్వేషపూరిత ప్రసంగాలు, సైబర్ వేధింపులు వంటి చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రావని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్య పదజాలం, పరువు నష్టం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరిగాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక అవమానకర వ్యాఖ్యలు చేయడం కూడా చట్టపరంగా సమర్థనీయం కాదని అన్నారు. సోషల...

తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై చేరికల కమిటీ సమావేశం..

చిత్రం
తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నేడు జనసేన పార్టీ చేరికల కమిటీ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నేమూరి శంకర్ గౌడ్, సీనియర్ నాయకుడు రాజలింగం పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే నాయకత్వాన్ని గుర్తించడం, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో చేరికల కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాసరావు, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, ముదురు సరస్వతి పాల్గొన్నారు.