పోస్ట్‌లు

ప్రాంతీయం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఏకశిల స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

చిత్రం
హనుమాన్ నగర్: హనుమాన్ నగర్‌లోని ఏకశిల స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు దేశభక్తి గీతాలు, నృత్యాలతో అలరించడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి  మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధుల వీరత్వం, దేశభక్తి గురించి విద్యార్థులకు తెలియచేశారు., సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించేలా విద్యార్థుల ప్రదర్శనలు సాగాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ కూలీ మృతి...

చిత్రం
వర్ధన్నపేట: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వర్ధన్నపేటలోని ఇల్లంద గ్రామానికి చెందిన మహమ్మద్ యాకుబ్ (52) రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు, ప్రతిరోజూ లాగే కూలి నిమిత్తం వరంగల్‌కు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో 12వ తేదీన మధ్యాహ్నం సుమారు 3.15 గంటలకు గ్రామంలోని ప్రధాన రహదారిపై బేతి సాంబయ్య ఇంటి సమీపంలో ఆటో నుంచి దిగాడు. అనంతరం రహదారి దాటుతుండగా వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న క్విడ్ కారు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాకుబ్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వెంటనే యాకుబ్‌ను 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆగస్టు 13న తెల్లవారుజామున సుమారు 4 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు మహమ్మద్ జామల్ (26) ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట ఎస్సై ఎన్. సాయి బా...

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: భానోత్ రవిచందర్

ములుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు, ఉద్యోగాలు తదితర పథకాలు ఇప్పిస్తామని కొందరు దళారులు అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు అర్హత ఆధారంగానే లభిస్తాయని, ఎవరైనా డబ్బులు తీసుకుని పథకాలు లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినా నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దళారుల మాయమాటలకు ఆకర్షితులై డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. ములుగు జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క నిరంతరం కృషి చేస్తున్నారని భానోత్ రవిచందర్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ పథకాలపై అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో ప్రజలకు ఈ అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపా...

గూడూరులో 17 ద్విచక్ర వాహనాలకు బహిరంగ వేలం

చిత్రం
గూడూరు, ఆగస్టు 11: వివిధ ఎక్సైజ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 17 ద్విచక్ర వాహనాలకు ఈ నెల 13న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గూడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నల్లబెల్లం, నాటుసారా రవాణా తదితర కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను గూడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి పి. కరంచంద్ సమక్షంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా ఎక్సైజ్ స్టేషన్‌లో ఉంచిన వాహనాలను స్వయంగా పరిశీలించుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రతి వాహనానికి విడిగా వాహనం ధరలో 50 శాతం మొత్తాన్ని **ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD)**గా గురువారం ఉదయం 10 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయంలోపు అవసరమైన మొత్తాన్ని చెల్లించి వేలంలో పాల్గొనాలని గూడూరు ఎక్సైజ్ సీఐ కోరారు.

ఆదివాసీల హక్కుల కోసం పోరాడుదాం: పాయం చిన్న చంద్రన్న

చిత్రం
నర్సంపేట : అస్తిత్వం, హక్కులు, మనుగడ కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అండగా నిలిచి పోరాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాయం చిన్న చంద్రన్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ నాయకుడు దార లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాయం చిన్న చంద్రన్న మాట్లాడారు. తరతరాలుగా ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవిస్తున్నారని, వారిని అభివృద్ధి చేయాల్సిన పాలకులు హామీలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల పూర్వీకుల నుంచి రక్షించుకుంటూ వస్తున్న ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని, భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను అమలు చేయడంతో పాటు పీసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, ఇళ్లు, పంటలకు గిట్టుబాటు ధర, విద్య, ఉపాధి, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల సమస్యల ప...

మేడారం ప్రధాన రహదారిపై హరిత కార్యక్రమం.. డివైడర్లలో మట్టి నింపి మొక్కలు నాటిన సర్పంచ్..

చిత్రం
ములుగు, ఆగస్టు 7 (అద్వైతాక్షరం): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక హరిత కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర మంత్రి సీతక్క సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి మార్గదర్శకత్వంలో మేడారం ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లలో మట్టి నింపి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడారం సర్పంచ్ పీరీల భారతి–వెంకన్న ఆధ్వర్యంలో ప్రధాన రహదారి డివైడర్లలో మట్టి నింపడంతో పాటు హరిత వే జంక్షన్ సమీపంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని, మొక్కలు పెరగడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. చెట్లను నరుకడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్ గొంది సరిత–నర్సింగరావు, వార్డు సభ్యురాలు అట్టం శైలజ–రమేష్, గ్రామ కార్యదర్శి శరత్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పా...

శనిగాపురం తండాల్లో కార్డెన్ అండ్ సెర్చ్.. 30 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం..

చిత్రం
మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం మైబాద్ రూరల్ సీఐ ఎన్. అంజలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శనిగాపురం గ్రామ పరిధిలోని పాత తండా, బోడతండాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 30 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల బెల్లం పానకంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెల్లం పానకాన్ని సంఘటన స్థలంలోనే ధ్వంసం చేశారు. గుడుంబా తయారీలో పాల్గొన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, ఎస్సై రవికిరణ్, కొరివి ఎస్సై సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల భద్రతకు సీసీ కెమెరాలే రక్షణ కవచం.. మూడు గ్రామాల్లో ఏర్పాటుకు ప్రజల సహకారం...

చిత్రం
హనుమకొండ (దామెర) : ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత కీలకమని దామెర ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్, తక్కళ్లపాడు, కౌకొండ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, రహదారి ప్రమాదాల దర్యాప్తు వంటి అంశాల్లో పోలీసులకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, ఉపసర్పంచ్ ముక్కెర రాజు రూ.50 వేల విలువైన సహాయం అందించారు. తక్కళ్లపాడు సర్పంచ్ వసంత రమేష్ రూ.27 వేల విలువైన సీసీ కెమెరాలను అందజేయగా, వెంకటాపూర్ సర్పంచ్ పంచగిరి రాజు, ఉపసర్పంచ్ గోల్కొండ రమేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఎస్సై అభినందించారు. ప్రజల భద్రత కోసం ఇతర గ్రామాల ప్...

కాజీపేటలో వరుస బైక్ చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్.. నాలుగు ద్విచక్ర వాహనాల స్వాధీనం...

చిత్రం
హనుమకొండ : కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ధ నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన తోటపల్లి రాజు (40) ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడికి గతంలో కూడా కాజీపేట, మట్వాడ, కేయూసీ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత అవసరాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్‌సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఇటీవల పెరుగుతున్న బైక్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన కాజీపేట పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. కాజీపేట సీఐ శ్యామ్‌సుందర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐలు బి. శివ, మౌనికా రెడ్డి, యాదగిరి, క్రైమ్ టీమ్ సభ్యులు వీ. క్రాంతికుమార్, జీ. కుమారస్వామి ప్రత్యేక బృందంగా గాలింపు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేద...

రామన్నగూడెం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క...

చిత్రం
ములుగు : ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేంకన్, ఆర్డీవో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్, రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. .

తొలి ఏకాదశి సందర్భంగా హనుమాన్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు...

చిత్రం
హనుమకొండ : హనుమాన్ నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి, పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులతో గుడి ప్రాంగణం కిటకిటలాడింది. హనుమాన్ నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారు . తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ అర్చకులు దీవించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథులన్నింటికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశిగా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా...

బ్యాటరీల చోరీ కేసును ఛేదించిన నర్సంపేట పోలీసులు.. ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ...

చిత్రం
నర్సంపేట : ఇటీవల పాకాల రోడ్డులోని ఓ బండల షాపులో ఉన్న రెండు గూడ్స్ ట్రాలీల బ్యాటరీలు చోరీకి గురైన ఘటనను నర్సంపేట స్టేషన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన బ్యాటరీలతో పాటు ఘటనలో ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆటోలో ముగ్గురు వ్యక్తులు వస్తుండగా, పోలీసులను గమనించిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా, ఆటోలో ఉన్న రెండు బ్యాటరీలను ఇటీవల పాకాల రోడ్డులోని బండల షాపు నుంచి దొంగిలించినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఎస్‌కే నాయాబ్ రసూల్ (ఎన్‌జీవోస్ కాలనీ), ముద్ధంగుల మహేష్ (వడ్డెర కాలనీ)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుల నుంచి చోరీకి గురైన రెండు గూడ్స్ ట్రాలీ బ్యాటరీలతో పాటు ఘటనలో ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు,...

CEIR పోర్టల్‌తో పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అప్పగించిన హసన్‌పర్తి పోలీసులు..

చిత్రం
హనుమకొండ , జూలై 23: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు తిరిగి అందజేయడంలో హసన్‌పర్తి పోలీసులు మరోసారి విజయవంతమయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో, స్టేషన్ సిబ్బంది కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను వినియోగించి పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి గురువారం బాధితులకు అందజేశారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితులు మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సంబంధిత వివరాలను CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం ఫోన్ల IMEI నంబర్ల ఆధారంగా సాంకేతిక నిఘా చేపట్టి, వాటి ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ బాధితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి వివరాలను ధృవీకరించిన అనంతరం అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయిస్తే ఫోన్‌ను గుర్తించే అవకాశాలు మెరుగుపడతాయని పోలీసులు సూచిం...

రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య..

చిత్రం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన ఈక చిన్న అప్పయ్య, అర్రెం బిక్షపతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో వారి నివాసాలకు వెళ్లిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య, మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎలాంటి ధైర్యం కోల్పోవద్దని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అదే విధంగా గాంధీనగర్ గ్రామానికి చెందిన గూగులోత్ రాజమ్మ గుండెపోటుతో మృతిచెందగా, ఆమె పార్థివదేహానికి కూడా కుంజా సూర్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగుల వెంకటకృష్ణ, INTUC జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రసాపూత్ సీతారామ్, గోవిందరావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింత క్రాంతి, ములుగు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మర్రి నరేష్, యూత్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు నాంపల్లి సుమన్, యూత్ నాయకులు తిరు...

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ..

చిత్రం
నర్సంపేట : కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా నర్సంపేట డివిజన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గిరిజన గ్రామాల్లో పర్యటించి, గిరిజనులను ఏకం చేస్తూ భూ పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన నిరంతరం డిమాండ్ చేశారని తెలిపారు. కోవిడ్ కాలంలో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఉద్యమానికి తన వంతు బాధ్యతగా పాల్గొన్నారని గుర్తు చేశారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకుడు బానోతు జవహర్‌లాల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అలువాల నరేష్, ఎం.డి. ఖలీల్, ఎస్.కే. రంజాన్, బాలరాజు, రాజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. మూలం...

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన హసన్‌పర్తి పోలీసులు..

చిత్రం
  హసన్‌పర్తి : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు అప్పగించడంలో హసన్‌పర్తి పోలీసులు విజయవంతమయ్యారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వాటి వివరాలను కేంద్ర ప్రభుత్వ CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం ఫోన్ల IMEI నంబర్లను బ్లాక్ చేసి అధునాతన సాంకేతిక నిఘా పరిజ్ఞానం ద్వారా వాటి ఆచూకీ (లొకేషన్) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ బాధితులకు అందజేయగా, తమ పోయిన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు కాపీ ఆధారంగా సంచార్ సాథి వెబ్‌సైట్‌లోని CEIR సేవ ద్వారా మొబైల్‌ను వెంటనే బ్లాక్ చేయాలన...

హసన్‌పర్తిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై పోలీసుల దాడి.. 7 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం స్వాధీనం

చిత్రం
హసన్‌పర్తి , జూలై 15: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం (16 ప్లాస్టిక్ సంచులు)ను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ డి. యాదగిరి, పోలీసు సిబ్బంది పి. ధనుంజయ్య, ఎం. భరత్లతో కలిసి ఎల్లాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, దండుగుల రమేష్ ఇంటి సమీపంలోని షెడ్డులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో షెడ్డుపై దాడి చేసి తనిఖీ చేయగా, 16 ప్లాస్టిక్ సంచుల్లో 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.21 వేలగా పోలీసులు అంచనా వేశారు. విచారణలో నిందితుడు దండుగుల రమేష్ (42), ఎల్లాపూర్ గ్రామంకు చెందినవాడని, చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి కిలోకు రూ.10 చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేసి, కిలో రూ.30కు విక్రయించేందుకు నిల్వ ఉంచినట్లు అంగీక...

పార్లమెంట్ సమావేశాల ముందు ఎంపీలతో సీఎం సమావేశం.. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కార్యాచరణ

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాన అంశాలు : ఐఐఎం హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి మంజూరు కోసం విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ: మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఫేజ్-1 స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం కోసం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR): ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తైందని, దక్షిణ భాగం భూసేకరణతో పాటు ప్రాజెక్టు పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరమని తెలిపారు. మూసీ పునరుజ్...

గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. చిన్నారుల భద్రతే లక్ష్యమన్న పోలీసులు

చిత్రం
మహబూబాబాద్ : చిన్నారుల భద్రత, బాలలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా అసౌకర్యంగా అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా షీ టీం, భరోసా సెంటర్ లేదా పోలీసులను సంప్రదించాలని అవగాహన కల్పించ...

మహబూబాబాద్ జిల్లాలో 128.496 కిలోల డ్రై గంజాయి దగ్ధం.

చిత్రం
మహబూబాబాద్: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ (NDPS) చట్టానికి సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.64.24 లక్షల విలువైన 128.496 కిలోల డ్రై గంజాయిని మంగళవారం చట్టప్రకారం పూర్తిగా దగ్ధం చేశారు. 'ఈగల్' (Elite Action Group for Drug Law Enforcement) మార్గదర్శకాల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థానం అనుమతితో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిబంధనల ప్రకారం నాశనం చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో ప్రత్యేక యంత్రాల ద్వారా గంజాయిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ చట్టం క...