రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య..
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన ఈక చిన్న అప్పయ్య, అర్రెం బిక్షపతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో వారి నివాసాలకు వెళ్లిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య, మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎలాంటి ధైర్యం కోల్పోవద్దని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అదే విధంగా గాంధీనగర్ గ్రామానికి చెందిన గూగులోత్ రాజమ్మ గుండెపోటుతో మృతిచెందగా, ఆమె పార్థివదేహానికి కూడా కుంజా సూర్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగుల వెంకటకృష్ణ, INTUC జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రసాపూత్ సీతారామ్, గోవిందరావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింత క్రాంతి, ములుగు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మర్రి నరేష్, యూత్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు నాంపల్లి సుమన్, యూత్ నాయకులు తిరు...