పోస్ట్‌లు

రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య..

చిత్రం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన ఈక చిన్న అప్పయ్య, అర్రెం బిక్షపతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో వారి నివాసాలకు వెళ్లిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య, మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎలాంటి ధైర్యం కోల్పోవద్దని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అదే విధంగా గాంధీనగర్ గ్రామానికి చెందిన గూగులోత్ రాజమ్మ గుండెపోటుతో మృతిచెందగా, ఆమె పార్థివదేహానికి కూడా కుంజా సూర్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగుల వెంకటకృష్ణ, INTUC జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రసాపూత్ సీతారామ్, గోవిందరావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింత క్రాంతి, ములుగు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మర్రి నరేష్, యూత్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు నాంపల్లి సుమన్, యూత్ నాయకులు తిరు...

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

చిత్రం
హైదరాబాద్ : "జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం తెలిపారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజానికి అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం, ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూలం: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Telangana)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్..

చిత్రం
హైదరాబాద్ : కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని డిశ్చార్జ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్, వైద్యుల సూచనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ప పవన్ కళ్యాణ్ నివాసంలోని వ్యక్తిగత లైబ్రరీని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సందర్శించి, అక్కడ ఉన్న పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచయితలు, మేధావులు, విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రచించిన గ్రంథాలపై పవన్ కళ్యాణ్‌తో ఆసక్తికరంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఒక పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ చేశారు. తన ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఆప్యాయంగా విచ్చేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మూలం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం (AP Deputy CMO)

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ..

చిత్రం
నర్సంపేట : కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా నర్సంపేట డివిజన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గిరిజన గ్రామాల్లో పర్యటించి, గిరిజనులను ఏకం చేస్తూ భూ పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన నిరంతరం డిమాండ్ చేశారని తెలిపారు. కోవిడ్ కాలంలో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఉద్యమానికి తన వంతు బాధ్యతగా పాల్గొన్నారని గుర్తు చేశారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకుడు బానోతు జవహర్‌లాల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అలువాల నరేష్, ఎం.డి. ఖలీల్, ఎస్.కే. రంజాన్, బాలరాజు, రాజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. మూలం...

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన హసన్‌పర్తి పోలీసులు..

చిత్రం
  హసన్‌పర్తి : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు అప్పగించడంలో హసన్‌పర్తి పోలీసులు విజయవంతమయ్యారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వాటి వివరాలను కేంద్ర ప్రభుత్వ CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం ఫోన్ల IMEI నంబర్లను బ్లాక్ చేసి అధునాతన సాంకేతిక నిఘా పరిజ్ఞానం ద్వారా వాటి ఆచూకీ (లొకేషన్) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ బాధితులకు అందజేయగా, తమ పోయిన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు కాపీ ఆధారంగా సంచార్ సాథి వెబ్‌సైట్‌లోని CEIR సేవ ద్వారా మొబైల్‌ను వెంటనే బ్లాక్ చేయాలన...

హసన్‌పర్తిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై పోలీసుల దాడి.. 7 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం స్వాధీనం

చిత్రం
హసన్‌పర్తి , జూలై 15: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం (16 ప్లాస్టిక్ సంచులు)ను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ డి. యాదగిరి, పోలీసు సిబ్బంది పి. ధనుంజయ్య, ఎం. భరత్లతో కలిసి ఎల్లాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, దండుగుల రమేష్ ఇంటి సమీపంలోని షెడ్డులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో షెడ్డుపై దాడి చేసి తనిఖీ చేయగా, 16 ప్లాస్టిక్ సంచుల్లో 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.21 వేలగా పోలీసులు అంచనా వేశారు. విచారణలో నిందితుడు దండుగుల రమేష్ (42), ఎల్లాపూర్ గ్రామంకు చెందినవాడని, చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి కిలోకు రూ.10 చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేసి, కిలో రూ.30కు విక్రయించేందుకు నిల్వ ఉంచినట్లు అంగీక...

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే తెలంగాణ భవిష్యత్‌ను నిర్మించాలి: సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. "పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి" అని పేర్కొన్నారు. చదువే జీవితాన్ని మార్చే శక్తి అని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్య ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా కుటుంబాలకు ఆనందాన్ని తీసుకొస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కిట్ల నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా స్వీకరించే విధానాన్ని విద్యాశాఖ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను...

ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం: నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు పునాది – సీఎం రేవంత్ రెడ్డి.

చిత్రం
హైదరాబాద్ : కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కాలానుగుణంగా ఎదగాలని సూచించారు. నైపుణ్యాలు వ్యక్తిగత విజయానికే కాకుండా సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు. యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోందని, ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధునిక పరిశ్రమలు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. "నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు... నైపుణ్యాలను పెంపొందించుకోండి. మీ వ్యక్తిగత విజయంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ ...

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రాన్ని కోరిన సీఎం

చిత్రం
ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణంపై చర్చించారు. ఈ రెండు విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానాంశాలు : ➡️ ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వరంగల్ కీలక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ➡️ వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో (విమానాల నిర్వహణ, మరమ్మతులు), ఎయిర్ కార్గో, హ్యాంగర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించేలా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ➡️ వరంగల్ విమానాశ్రయ డిజైన్‌లో కాకతీయుల చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా రూపకల్పన చేయాలని సీఎం సూచించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ➡️ ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలోని...

పార్లమెంట్ సమావేశాల ముందు ఎంపీలతో సీఎం సమావేశం.. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కార్యాచరణ

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాన అంశాలు : ఐఐఎం హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి మంజూరు కోసం విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ: మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఫేజ్-1 స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం కోసం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR): ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తైందని, దక్షిణ భాగం భూసేకరణతో పాటు ప్రాజెక్టు పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరమని తెలిపారు. మూసీ పునరుజ్...

మైనర్‌పై లైంగిక దాడి.. పోక్సో కేసులో యువకుడు అరెస్ట్

చిత్రం
గీసుగొండ : ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మసాగర్‌కు చెందిన **బొడ్డు బన్నీ (21)**పై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. 2023లో పదో తరగతి చదువుతున్న సమయంలో బాధితురాలికి పరిచయమైన నిందితుడు, ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ వెంచర్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం 2024 వరకు పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా, గర్భస్రావానికి సంబంధించిన మాత్రను కేకులో కలిపి తినిపించినట్లు, అలాగే తన వద్దకు రాకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు ఇటీవల వరంగల్‌లో ఆమెపై దాడి చేసి మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు కూడా తెరుస్తామని ఏసీపీ వెంకటేష్ హె...

ఆసియా U23 అథ్లెటిక్స్‌లో తెలంగాణ కీర్తి పతాకం.. ప్రవల్లిక నరిమళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

చిత్రం
చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణకు చెందిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ అయిన ప్రవల్లిక నరిమళ్ల ఆసియా U23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి మహిళల 4×400 మీటర్ల రిలేలో భారత జట్టుకు స్వర్ణ పతకాన్ని అందించడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ప్రవల్లిక అంతర్జాతీయ వేదికపై రాణించడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారని ప్రశంసించారు. మహిళల 4×400 మీటర్ల రిలేలో ప్రవల్లిక నరిమళ్లతో పాటు శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్ సభ్యులుగా ఉన్న భారత జట్టు 3 నిమిషాల 33.62 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆతిథ్య దేశం చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థాన...

లెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచంలో విషాదం..

చిత్రం
ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. వయోభారంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 1938 ఏప్రిల్ 23న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి, తన మధుర గానంతో భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 17 భాషల్లో 50 వేలకుపైగా పాటలు ఆలపించి కోట్లాది సంగీతాభిమానుల అభిమానాన్ని సంపాదించారు. ఆమె గాన ప్రతిభకు గుర్తింపుగా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి. దాదాపు ఆరు దశాబ్దాలపాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సినీ సంగీతానికి చిరస్మరణీయమైన సేవలను అందించింది. ఎస్. జానకి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఆమె తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నవరసాలను ఆవిష్కరిస్తూ ఆమె ఆలపించిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయని తెలిపారు. తెలుగు వారు కావడం తెలుగు ప...

హసన్‌పర్తి పెద్ద చెరువులో వృద్ధురాలి మృతదేహం లభ్యం..

చిత్రం
హసన్‌పర్తి : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, హసన్‌పర్తి గ్రామానికి చెందిన కోడూరి మీనయ్య భార్య రాజమణి (71) గత పదేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో హసన్‌పర్తి పెద్ద చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త మీనయ్య ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స విజయవంతం.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, ప్రస్తుతం తొలిదశలో కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయకుండా, ముందుగా కుడి భుజానికి చికిత్స అందించారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజాలకు గాయాలు కాగా, అనంతరం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినప్పటికీ ప్రజా కార్యక్రమాలు, సమావేశాలు, పాదయాత్రలు, ఎన్నికల ప్రచారాల్లో నిరంతరం పాల్గొన్నారు. ఈ క్రమంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో తరచూ కరచాలనాలు, ఆప్యాయంగా పలకరింపులు జరగడం వల్ల గాయాలు మరింత తీవ్రతరమైనట్లు వెల్లడైంది. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్‌తో పాటు కండరాల చీలికలు (మసిల్ టియర్స్) కూడా ఉన్నట్లు వైద్యులు...

2036 ఒలింపిక్స్‌కు తెలంగాణ వేదిక కావాలి.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం.. ఆరుగురు క్రీడాకారులకు రూ.7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలు.. 2026 ఖేలో ఇండియా సహా పలు అంతర్జాతీయ టోర్నీలకు తెలంగాణ ఆతిథ్యం హైదరాబాద్ : 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ, ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ వేదిక కావాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆ దిశగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. గచ్చీబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 82 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి 2028 డిసెంబరులో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణలో స్పష్టమైన క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని, నిజమైన క్రీడాకారులక...

ఓఆర్‌ఆర్ పరిధిని కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

చిత్రం
హైదరాబాద్ నగరంలోని బయటి వలయ రహదారి (ఓఆర్‌ఆర్) అంతర్భాగాన్ని పూర్తిగా కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 1.35 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి చేపడతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల తయారీ కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సంస్థ రూపొందించిన సౌరశక్తితో పనిచేసే వీధి దీపం, గాలిని శుద్ధి చేసే ‘ఆక్సీట్రీ’ వ్యవస్థతో పాటు తయారీ విభాగంలోని ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల కాలుష్యం, మూసీ నది కాలుష్యం నగర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ఓఆర్‌ఆర్ పరిధిలోని ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య...

టీజీపీఎస్సీ నుంచి మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు.. 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం.

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరోసారి శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని రెండు కీలక ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న మొత్తం 29 పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నియామక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో 10 పోస్టులు, తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో 19 పోస్టులు ఉన్నాయి. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో 10 పోస్టులు 05/G/TP/2026 నోటిఫికేషన్ ప్రకారం మల్టీ జోనల్ కేడర్ పరిధిలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జూలై 10 నుంచి ఆగస్టు 17, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతనం అందనుంది. ఈ పోస్టులకు B.Arch, B.E./B.Tech (సివిల్), B.Planning లేదా B.Tech (Planning)లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అదేవిధంగా M.A./M.Sc (Geography) లేదా M.Sc (Geoinfo...

గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. చిన్నారుల భద్రతే లక్ష్యమన్న పోలీసులు

చిత్రం
మహబూబాబాద్ : చిన్నారుల భద్రత, బాలలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా అసౌకర్యంగా అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా షీ టీం, భరోసా సెంటర్ లేదా పోలీసులను సంప్రదించాలని అవగాహన కల్పించ...

మహబూబాబాద్ జిల్లాలో 128.496 కిలోల డ్రై గంజాయి దగ్ధం.

చిత్రం
మహబూబాబాద్: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ (NDPS) చట్టానికి సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.64.24 లక్షల విలువైన 128.496 కిలోల డ్రై గంజాయిని మంగళవారం చట్టప్రకారం పూర్తిగా దగ్ధం చేశారు. 'ఈగల్' (Elite Action Group for Drug Law Enforcement) మార్గదర్శకాల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థానం అనుమతితో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిబంధనల ప్రకారం నాశనం చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో ప్రత్యేక యంత్రాల ద్వారా గంజాయిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ చట్టం క...

డిజిటల్ గవర్నెన్స్‌తో పరిపాలనలో పారదర్శకత.. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలపై సీఎం కీలక ఆదేశాలు.

చిత్రం
హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనలో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించేందుకు వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, అవసరమైతే చట్టపరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా డిజిటల్ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ నుంచే జీతాలు అందేలా ఉద్యోగులు, జీతాలు, బ్యాంకు ఖాతాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో రాష్ట్రంలో సుమారు 4,800 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభ...

వాహనాన్ని ఢీకొట్టి.. ఆపై బాధితుడి మీద దాడి... నిందితుడి అరెస్ట్.

చిత్రం
గీసుగొండ, జూలై 6 (అద్వైత అక్షరం): రోడ్డు ప్రమాదానికి కారణమై ఆపై బాధితుడి మీద దాడికి పాల్పడిన నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, గీసుగొండ మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన బాల్తా బుచ్చిబాబు గత నెల (మే 21) న రాత్రి 7 గంటల సమయంలో మచ్చాపురం–ఎలుకుర్తి రహదారిపై వస్తుండగా అదే గ్రామానికి చెందిన కంబాల వెంకటేష్ టూవీలర్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బుచ్చిబాబును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదంపై బుచ్చిబాబు వెంకటేష్ ను ప్రశ్నించగా వెంకటేష్ తీవ్ర పదజాలంతో దూషించి దాడికి చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం సమీపంలో ఉన్న రాయితో కాలిపై కొట్టడంతో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గీసుగొండ పోలీసులు హెచ్చరించార...

స్టేషన్ ఘన్‌పూర్ 17వ వార్డులో 33 కేవీ విద్యుత్ లైన్ తొలగింపు.. స్థానికుల్లో హర్షం

చిత్రం
స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని 17వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా 33 కేవీ విద్యుత్ లైన్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గాదె ఈశ్వరయ్య నివాసం సమీపంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా కిందికి ఉండటంతో వాహనాలు, పాఠశాల బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను స్థానికులు పలుమార్లు గతంలో ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. అనంతరం ప్రస్తుత కౌన్సిలర్ పొన్నం స్వరూప్ రాజయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వెంటనే స్పందించి 33 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో స్థానికులు కౌన్సిలర్ పొన్నం స్వరూప్ రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్, పొన్నం నాగరాజు, రంజిత్ కుమార్, నీల పరశురాములు, మామిండ్ల శ్రీను, పండుగ అశోక్, మునిగేల రాజు, రమేష్, మధు, పవన్, శ్రవణ్, వేముల రాము, పిట్టల చంద్రయ్య, ఉరడి శ్రీను, అఖిల్, కుంభం మధు, నితిన్, శగా శి...

ములుగు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. భార్యతో పాటు ముగ్గురు అరెస్ట్..

చిత్రం
ములుగు జిల్లా జాకారం శివారులో ఇటీవల వెలుగులోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. హత్యకు గురైన వ్యక్తిని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామానికి చెందిన సిరిపంగ నర్సింహులు (42) గా గుర్తించారు. ఈ కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 26న జాకారం గ్రామ శివారులోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వెనుక వ్యవసాయ భూమిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గ్రామ కారోబార్ ఫిర్యాదు మేరకు ములుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు ములుగు సీఐ, సీసీఎస్ సీఐ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. దర్యాప్తులో మృతుడి వివరాలను గుర్తించడంతో పాటు హత్యకు పాల్పడిన నిందితులను 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మృతుడి భార్య సిరిపంగ శోభారాణి (A1), తాపీ మేస్త్రీ అల్లా పెద్ద వెంకటేశ్వర్లు (A2), మరో తాపీ మేస్త్రీ నీల దుర్గారెడ్డి (A3) ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో శోభారాణి, పెద్ద వెంకటేశ్వర్ల...

తెలంగాణ పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

చిత్రం
హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 5,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది . ఈ నియామక ప్రక్రియను త్వరలో Telangana Police Recruitment Board చేపట్టనుంది. కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు వివిధ పోలీసు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పోస్టుల వారీ ఖాళీలు : పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ (ఆర్మ్డ్ రిజర్వ్): 1,052 పోస్టులు సబ్‌ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 పోస్టులు రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఆర్మ్డ్ రిజర్వ్): 14 పోస్టులు రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (TGSP): 12 పోస్టులు ఇతర విభాగాల పోస్టులు: 77 మొత్తం ఖాళీలు: 5,000 అర్హతలు (అధికారిక నోటిఫికేషన్ ప్రకారం తుది వివరాలు) కానిస్టేబుల్: ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత. సబ్‌ ఇన్‌స్పెక్టర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. ఎంపిక విధానం : ప్రిలిమినరీ రాత పరీక్ష ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) తుది రాత పరీక్ష (వర్తించే పోస్టులకు) సర్టిఫికెట్ వెరిఫికేషన్ వైద్య పరీక్ష పోలీస్ ఉద్యోగాలకు స...

ఖానాపూర్‌లో 2 కిలోలకు పైగా గంజాయి పట్టివేత..

చిత్రం
ఖానాపూర్, జూలై 2: ఖానాపూర్ మండలంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో గంజాయి లభ్యం... పోలీసుల కథనం ప్రకారం, జూలై 1న మధ్యాహ్నం అశోక్‌నగర్ గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిందితుడి వద్ద నుంచి 2.038 కిలోల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,01,900 ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్టైన వ్యక్తిని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టలభూపతి తండాకు చెందిన మాలోత్ కళ్యాణ్ (23)గా పోలీసులు గుర్తించారు. అతడిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన ప్రక్రియ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా, మహబూబాబాద్ సబ్-జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఏజెన్సీ ప్రాంతాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి: ముఖ్యమంత్రికి ఆదివాసీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములకు హక్కు పట్టాలు మంజూరు చేయాలని, ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నతీకరించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), వెడ్మ బొజ్జు (ఖానాపూర్) ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు.

ఘనపూర్‌లో బీరప్ప దేవాలయ నిర్మాణానికి భూమి పూజ..

చిత్రం
ఘనపూర్, జూలై 2 (అద్వైత అక్షరం): ఘనపూర్ పట్టణంలో బీరప్ప దేవాలయ నిర్మాణానికి గురువారం వైభవంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ వినయ్, వైస్ చైర్మన్ రాజమ్మ గట్టయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పొన్న రవి, తొకల అనూష రాజు, పొన్నం రాజయ్యతో పాటు కురుమ సంఘం కమిటీ సభ్యులు కమల కృష్ణ, అము రాజ్, గుంటి రాజయ్య, రాజయ్య మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీరప్ప దేవాలయ నిర్మాణం పూర్తయితే భక్తులకు ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తరించడంతో పాటు ఘనపూర్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతం అవుతుందని కౌన్సిలర్ పొన్న రవి  అభిప్రాయ పడ్డారు.

సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సందేశం.. అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడి

చిత్రం
భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తి గౌరవం.. కానీ దూషణలు, బెదిరింపులు, తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం. అమరావతి, జూలై 1 : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక సందేశాన్ని విడుదల చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ, అది అపరిమిత హక్కు కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ప్రశ్నించే హక్కు, నిర్ణయాలతో విభేదించే హక్కును తమ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. అయితే వ్యక్తిగత దూషణలు, ప్రాణహానితో బెదిరింపులు, ఆధారాలు లేని ఆరోపణలు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, మత విశ్వాసాలను అవమానించడం, ద్వేషపూరిత ప్రసంగాలు, సైబర్ వేధింపులు వంటి చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రావని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్య పదజాలం, పరువు నష్టం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరిగాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వక అవమానకర వ్యాఖ్యలు చేయడం కూడా చట్టపరంగా సమర్థనీయం కాదని అన్నారు. సోషల...

దేశానికే ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిత్రం
స్టేషన్ ఘనపూర్, జూలై 1: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలానికి చెందిన 6 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.6,00,696 విలువైన చెక్కులు , అలాగే 37 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.13,62,700 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాల బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద వర్గా...

తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఊరట?

చిత్రం
దేశంలో బంగారం ధరలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కొన్ని నెలల క్రితం ప్రధానమంత్రి  మోడీ అవసరం లేని బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేయాలని ప్రజలకు సూచించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడం, దిగుమతుల భారాన్ని నియంత్రించడం వంటి ఆర్థిక కారణాల నేపథ్యంలో ఈ పిలుపు వచ్చినట్లు అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ తర్వాత బంగారం మార్కెట్‌లో పలు మార్పులు కనిపించాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల ధోరణి, స్థానిక డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా నేడు (జూలై 1, 2026) దేశీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. అందుబాటులో ఉన్న తాజా వివరాల ప్రకారం: * 24 క్యారెట్ బంగారం (1 గ్రాము): సుమారు ₹14,078 * 22 క్యారెట్ బంగారం (1 గ్రాము): సుమారు ₹12,905 అంటే 10 గ్రాములకు లెక్కిస్తే: * 24 క్యారెట్: సుమారు ₹1,40,780 * 22 క్యారెట్: సుమారు ₹1,29,050 మార్కెట్ వర్గాల ప్రకారం ఇటీవల కొన్ని ప్రాంతాల్లో 10 గ్రాములపై తగ్గుదల నమోదు కావడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ధరలు తగ్గు...

తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా నిధులు విడుదల.. తొలి విడతలో రూ. 2,482 కోట్ల జమ

చిత్రం
హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  కంప్యూటర్ మీట నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయంగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వచ్చే 9 రోజుల్లో మొత్తం రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి రూ. 2,482.02 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ. 1.75 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కింద రూ. 20,677 కోట్లు చెల్లించామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో బకాయి పడిన రైతు భరోసా నిధులను చెల్లించామని, రైతు భరోసా మొత్తాన్ని రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు పెంచినట్లు వివరించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 27 వేల కోట్లకు పైగా జమ కాగా, త...

Fly Ash Bricks Vs Red Soil (ఎర్ర మట్టి) ఇటుకలు – ఇల్లు కట్టేవారికి ఏది మంచిది?

చిత్రం
ఇల్లు నిర్మాణంలో ఫౌండేషన్ తర్వాత ఎక్కువగా ప్రభావం చూపే అంశాల్లో ఇటుకల ఎంపిక కూడా ఒకటి. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రధానంగా Fly Ash Bricks మరియు Red Soil Bricks (ఎర్ర మట్టి ఇటుకలు) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే రెండింటి మధ్య తేడా ఏమిటి? ఏది మంచిది? తెలుసుకుందాం. తయారీ విధానం : Fly Ash Bricks: థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లై యాష్‌తో పాటు సిమెంట్, ఇసుక, ఇతర పదార్థాలతో యంత్రాల ద్వారా తయారు చేస్తారు. Red Soil Bricks: సహజ మట్టిని ఆకారంలోకి మార్చి భట్టీల్లో కాల్చి తయారు చేస్తారు. బలం (Strength) : ఫ్లై యాష్ ఇటుకలు సాధారణంగా ఒకే ప్రమాణంలో తయారవ్వడం వల్ల నాణ్యత స్థిరంగా ఉంటుంది. ఎర్ర మట్టి ఇటుకల బలం తయారీ విధానం, మట్టి నాణ్యతపై ఆధారపడి మారవచ్చు. నీటి శోషణ : ఫ్లై యాష్ ఇటుకలు తక్కువ నీటిని పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. దీనివల్ల తేమ, సీపేజ్ సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. నిర్మాణ ఖర్చు : ఫ్లై యాష్ ఇటుకలు సైజులో సమానంగా ఉండటంతో మోర్టార్, ప్లాస్టర్ వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది. ఎర్ర ఇటుకల్లో ఫినిషింగ్ కోసం అదనపు పని అవసరం కావచ్చు. పర్యావరణ ప్రభావం : ఫ్లై యాష్ ఇటుకలు పరిశ్రమ ...

టిమ్స్‌లో 122 ఉద్యోగాల భర్తీ – దరఖాస్తులకు ఆహ్వానం.

చిత్రం
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), సనత్‌నగర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నియామక ప్రక్రియను నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నిర్వహిస్తోంది. మొత్తం 122 ఖాళీలను భర్తీ చేయనుండగా, అందులో 98 టెక్నీషియన్ పోస్టులు , 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ 22 జూన్ 2026 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించేందుకు 06 జూలై 2026 సాయంత్రం 4 గంటల వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1,000 , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. వయోపరిమితి విషయానికి వస్తే, టెక్నికల్ మరియు అనుబంధ పోస్టులకు గరిష్టంగా 35 సంవత్సరాలు , అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 45 సంవత్సరాలు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. వయస్సును 01 జూలై 2026 నాటికి పరిగణిస్తారు. అర్హత, అనుభవం, పోస్టుల ...

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం – పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంల పేరిట తల్లిదండ్రులపై అదనపు ఒత్తిడి?

చిత్రం
  ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం – పుస్తకాలు, యూనిఫాంల పేరిట తల్లిదండ్రులపై అదనపు ఒత్తిడి? తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా బోధనకు పరిమితమవ్వాల్సిన పాఠశాలలు కొన్ని చోట్ల పుస్తకాలు, యూనిఫాంల విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రుల వాదన ప్రకారం, పాఠశాలలే సూచించిన చోట లేదా నేరుగా పాఠశాలల నుంచే పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్  కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నా, ఇతర చోట్ల కొనుగోలు చేసే అవకాశాన్ని పరిమితం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా, పుస్తకాలు, యూనిఫాంలకు నగదు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల సరైన రసీదులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో ఖర్చులపై స్పష్టత లేకుండా పోతోందని, భవిష్యత్తులో వివాదాలు వచ్చినప్పుడు ఆధారాలు లేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల్సిన విద్యాసంస్థలు, ఆర్థిక భారాన్ని తగ్...

రెండు చుక్కలు.. జీవితాంతం రక్షణ..

చిత్రం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా (28/06/2026-30/06/2026) వరకు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి ఈరోజే తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని, వారి ఆరోగ్యవంతమైన జీవితానికి మరియు బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతాయని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం.. పోలియో రహిత భారతదేశం కోసం.. ప్రతి చిన్నారికి నేడు పోలియో చుక్కలు వేయించండి.

పాలకుర్తిలో 1.8 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురు అరెస్ట్..

చిత్రం
పాలకుర్తి : మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు కొనసాగిస్తున్న పాలకుర్తి పోలీసులు కీలక విజయం సాధించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన తనిఖీల్లో 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీ దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జూన్ 27న పాలకుర్తి బస్ స్టాండ్ పరిసరాల్లో వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా 1.8 కిలోల గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.90 వేలుగా అంచనా వేశారు. అలాగే రవాణాకు ఉపయోగించిన బ్యాగు, మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశాలోని బరంపూర్ ప్రాంతానికి చెందిన అమర్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఖాన్ అక్రమ్ యార్ మహమ్మద్, వాజిద్ సజ్జన్లకు సరఫరా చేసేందుకు తరలిస్తున్నట్లు వె...

మూసీ రివర్ ఫ్రంట్ తొలి దశ పనులపై సీఎం సమీక్ష...

చిత్రం
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్‌బెడ్‌లో నివసిస్తున్న అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు తొలి దశ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ప్రాజెక్టు అమలులో అవసరమైన ప్రాంతాల్లో భూ సేకరణ చేపట్టేటప్పుడు భూ యజమానుల ఆసక్తిని బట్టి టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) ఇవ్వడం లేదా పరిహారం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని సమావేశంలో ప్రస్తావించారు. నెక్లెస్ రోడ్డులో ప్రజల కోసం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మూసీ ప్రాజెక్టు కింద చేపట్టబోయే...

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మొండ్రాయి గ్రామసభ నిర్వహణ..

చిత్రం
 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మొండ్రాయ్ గ్రామంలో గ్రామసభనిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్‌ఐ వంశీకృష్ణ, గ్రామ ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు, కుటుంబ వ్యవస్థ మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తూ, వాటి వినియోగం, విక్రయం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేద్దాం” అనే సందేశంతో గ్రామస్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారంతో నిరంతరం చర్యలు కొనసాగిస్తామని సంగెం పోలీసులు తెలిపారు.

రోడ్డు భద్రతే లక్ష్యం – మొండ్రాయి మార్గంలో మరో 5 హెచ్చరిక బోర్డుల ఏర్పాటు...

చిత్రం
ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంగెం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మొండ్రాయి మార్గంలో మరో 5 రోడ్డు భద్రత హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇదే మార్గంలో 20 రోడ్డు భద్రత బోర్డులు ఏర్పాటు చేయగా, వాహనదారుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో 3డీ పోలీస్ ఇన్నోవా వాహనం నమూనాను కూడా ఏర్పాటు చేశారు. తాజా బోర్డులతో కలిపి సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 రోడ్డు భద్రత హెచ్చరిక బోర్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ హెచ్చరిక బోర్డుల ద్వారా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర అలవాట్లపై అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల పాటనకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని, అతివేగాన్ని నివారిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి.

చిత్రం
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తాయని, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడంలో అవగాహన, అప్రమత్తత, సామాజిక బాధ్యత కీలకమని తెలిపారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ‘డ్రగ్ ఫ్రీ తెలంగాణ’ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ.. ఉద్యోగుల్లో భద్రత, విశ్వాసమే లక్ష్యం: సీఎం

చిత్రం
హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బీమా సౌకర్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం పెంచడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులతో ఉద్యోగుల బీమా రక్షణకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదనతో సింగరేణి కార్మికులకు ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.1 కోటి బీమా అమలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకూ అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని, ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రతి నెల మొదటి తేదీకే జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. విరమణ ప్రయోజనాల బకాయిల పరిష్కారానికి విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నామని, వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు...